[njwa_button id="1872"]
Categories: NewsPolitics

Chandrababu : తెలంగాణ, ఏపీ నాకు రెండు కళ్లు.. మళ్లీ జన్మ ఉంటే తెలుగు గడ్డ మీదే పుడతా : చంద్రబాబు

Chandrababu : ప్రపంచంలో 30 శాతం అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి. దాని కోసం నేను పని చేస్తా. నాకు తెలంగాణ అని, ఆంధ్రా అని కాదు. తెలుగు వారి అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తా.. ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం అయిన చంద్రబాబు.. ఈసందర్భంగా మాట్లాడుతూ తనకు తెలుగు జాతి అన్నీ ఇచ్చిందన్నారు.

Advertisement

Advertisement

ఏ నాయకుడికి ఇవ్వని గౌరవం ఇచ్చింది. తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సమైఖ్యాంధ్రప్రదేశ్ లో తొమ్మిదిన్నర ఏళ్లు ఎవ్వరూ ముఖ్యమంత్రిగా లేరు. 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నా. నా రికార్డు ఎవ్వరూ బ్రేక్ చేయడానికి కూడా అవకాశం లేదు.. రెండు రాష్ట్రాలుగా విడిపోయింది కాబట్టి. మళ్లీ నాకు పునర్జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డ పైనే పుట్టాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని చంద్రబాబు తెలిపారు.

Chandrababu : జగన్ పాలన వల్లనే ఏపీకి ఎక్కువ నష్టం

నేను ముఖ్యమంత్రిని అయినప్పుడు మొదటి సారిగా 2014 లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 35 శాతం వ్యత్యాసం. తెలంగాణలో ఎక్కువ ఉంది. దానికి కారణం హైదరాబాద్. నేను బాగా కష్టపడి 2014 నుంచి 2019 వరకు కష్టపడితే ఆ వ్యత్యాసాన్ని 27.5 శాతానికి తగ్గించాం. మళ్లి వాళ్ల ప్రభుత్వం వచ్చింది. 5 ఏళ్లు ఇష్టానుసారంగా చేశారు. ఇప్పుడు 44 శాతానికి తలసరి ఆదాయం పోయింది.

విభజన వల్ల జరిగిన నష్టం కంటే.. 5 ఏళ్ల వాళ్ల పాలన వల్ల ఎక్కువ నష్టం జరిగింది. ఏపీ ఇబ్బందుల్లో ఉంది. కానీ.. నేను ఒక్కటే చెప్పానను. ఇబ్బందులు అధిగమించి మళ్లీ ఏపీకి గట్టెక్కించే బాధ్యత నేను తీసుకుంటాను.

నన్ను ఏ కారణం లేకుండా జైలులో పెట్టాను. హైదరాబాద్ లో మీరు చూపించిన ప్రేమ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేదు. విప్రో సెంటర్ లో, గచ్చిబౌలిలో మీటింగ్ పెడితే మేమే నాయకులం అని చెప్పి లక్షలాది మంది వచ్చారు. అది నా జీవితంలో నేను ఎప్పుడూ మరిచిపోలేను. నేను చేసిన అభివృద్ధిని గుర్తు పెట్టుకొని నాకు సంఘీభావం తెలిపారు అని నేను జైలులో ఉండి చూశాను. ప్రపంచంలోని అన్ని దేశాల్లో తెలుగు వారు 53 రోజులు రోడ్డు ఎక్కి నిరసనలు తెలిపారు. ఇది మరిచిపోలేని అనుభవం నాకు అని చంద్రబాబు అన్నారు.

అలాగే.. విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకొని తానే స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశానని.. తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. తెలుగు వారు ఐకమత్యంగా ఉండాలి. రెండు రాష్ట్రాలు వేరు అయినా.. ఎవరి పాలన వారిదే. ఎవరైనా మన తెలుగు వారి జోలికి వస్తే మాత్రం, మేము ఒకటే అని కలిసికట్టుగా పోరాడి సాధించుకోవాలి. రెండు రాష్ట్రాలు గొడవలు పెట్టుకోవాలని కొంత మంది కోరుకుంటున్నారు.. వాళ్ల ధోరణి మారాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

Author

Latest Telugu News Desk

Recent Posts

Zodiac Signs : భాగ్యాధిపతి అనుగ్రహంతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం… ఇకపై అన్ని శుభయోగాలే…!

Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…

6 months ago

Potatoes : ఆలూ తో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారా… తస్మాత్ జాగ్రత్త…!

Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…

6 months ago

RRB Jobs : పారామెడికల్ రిక్రూట్‌మెంట్.. 1,376 ఖాళీలు.. పోస్టుల వివ‌రాలు ఇవే..!

RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…

6 months ago

5 Lakhs Money : మహిళలకు 5 లక్షలు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 24 గంటల్లోనే ఖాతాల్లోకి..!

5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…

6 months ago

AP Job Mela : ఏపీలో 300 పోస్టులకు నోటిఫికేషన్.. మీరు ట్రై చేయండి..!

AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…

6 months ago

Google Pay – phonepe : కస్టమర్లకు పెద్ద షాక్ ఇవ్వబోతున్న గూగుల్ పే, ఫోన్ పే.. కొత్త పేమెంట్ సిస్టమ్ ఏంటో తెలుసా..?

Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…

6 months ago