[njwa_button id="1872"]
[njwa_button id="1872"]
Team India : హమ్మయ్య.. ఎట్టకేలకు టీమిండియా ఆటగాళ్లు భారత్ కు చేరుకున్నారు. టీ 20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత్ లో తొలిసారి అడుగు పెట్టారు టీమిండియా ప్లేయర్స్. అందుకే వాళ్లకు క్రికెట్ అభిమానులంతా గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఢిల్లీకి స్పెషల్ విమానంలో చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు ఎక్కడెక్కినుంచో వచ్చిన క్రికెట్ అభిమానులు స్వాగతం పలికారు. నేషనల్ ఫ్లాగ్స్ ఊపుతూ వాళ్లకు ఘనస్వాగతం పలికారు.
ఇక.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని ఫ్యాన్స్ కు చూపిస్తూ అభివాదం చేశారు. జూన్ 29న జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. జూన్ 29న మ్యాచ్ ముగియగానే.. జూన్ 30న టీమిండియా భారత్ కు రావాల్సి ఉంది కానీ.. బార్బడోస్ లో బెరిల్ హరికేన్ వల్ల అక్కడే చిక్కుకుపోయారు.
అయితే.. టీమిండియా కోసం ఎయిర్ ఇండియా స్పెషల్ ఫ్లైట్ ను పంపించడంతో టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో ఇవాళ ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం ప్రధాని మోదీతో టీమిండియా ఆటగాళ్లు సమావేశమయ్యారు. మోదీని కలిసిన అనంతరం.. ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరారు.
ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముంబైలో టీమిండియా ఆటగాళ్ల రోడ్ షోను నిర్వహించనున్నారు. అనంతరం.. రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో బీసీసీఐ.. టీమిండియా ఆటగాళ్లకు సన్మానం చేయనుంది.
Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
This website uses cookies.