[njwa_button id="1872"]
[njwa_button id="1872"]
KTR : ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోవడం, వైసీపీ పార్టీకి 11 సీట్లు మాత్రమే రావడంపై తెలంగాణ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. వైఎస్ జగన్ ఓడిపోవడం ఏంటి.. అంటూ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ పార్టీ ఓటమి తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు కేటీఆర్. 2019 నుంచి 2024 ఎన్నికల వరకు ఐదేళ్ల పాటు పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన వైఎస్ జగన్ ఓడిపోవడం ఏంటి అంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇవాళ ఢిల్లీలో మీడియా ముందు మాట్లాడిన కేటీఆర్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయని.. అది మామూలు విషయం కాదన్నారు. కేవలం వైఎస్ జగన్ ను ఓడించేందుకే వైఎస్ షర్మిలను కొందరు పావులా వాడుకున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రతి రోజు జనంలోకి వెళ్లి.. ప్రజల బాగోగులు కనుక్కొని.. వాళ్లకు ఏ సమస్య ఉన్నా తానున్నానంటూ ముందుండి నడిచే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవడం నిజంగా తనను షాక్ నకు గురిచేసిందన్నారు. పవన్ కళ్యాణ్ కూటమితో కలవకుండా జనసేన పార్టీ ఒంటరిగా ఏపీ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే.. ఫలితాలు వేరే విధంగా ఉండేవని.. షర్మిలను పావులా వాడుకోవడం కోసం తప్పితే.. ఆమె ఏపీలో ఎన్నికల్లో చేసిందేం లేదని కేటీఆర్ నొక్కి చెప్పారు.
Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
This website uses cookies.