[njwa_button id="1872"]
[njwa_button id="1872"]
AP Rains : ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అందులోనూ ఎగువ కురుస్తున్న వర్షాల వల్ల గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాని వల్ల గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్రిడ్జి వద్ద నీటిమట్టం 10.2 అడుగులకు చేరుకుంది. దీంతో గోదావరి నీటిని డెల్టా కాలువకు అధికారులు విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి కూడా నీటిని పంపిస్తున్నారు అధికారులు.
మరోవైపు దేవిపట్నం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గండి పోచమ్మ అమ్మ వారి ఆలయం వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. ఇంకోవైపు 30వ జాతీయ రహదారి వద్ద అల్లూరి జిల్లా చట్టి వద్ద శబరి నది వరద నీరు చేరడంతో ఏపీ, తెలంగాణ మధ్య, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి.
హైవే 326 పైకి కూడా వరద నీరు చేరింది. దీని వల్ల ఒడిశా, ఆంధ్రా మధ్య రాకపోకలు నిలిచాయి. అలాగే.. విజయవాడ వద్ద ఉన్న ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి పెరిగింది. బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి చెందిన 14 గేట్లను అధికారులు వదిలారు. శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 97 వేలకు పైగా క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది.
Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
This website uses cookies.