[njwa_button id="1872"]
[njwa_button id="1872"]
IPS Transfer in Telangana : తెలంగాణలో 8 మంది ఐపీఎస్లను బదిలీ చేశారు. దానికి సంబంధించిన ఉత్తర్వులను తాజాగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా సుభాష్ ను నియమించారు. కొత్తగూడెం ఓఎస్డీగా పరితోష్ పంకజ్ నియమితులయ్యారు. ములుగు ఓఎస్డీగా మహేష్ బాబా సాహెబ్ నియమితులయ్యారు.
ఇక.. గవర్నర్ ఓఎస్డీగా సిరిశెట్టి సంకీర్త్, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్, భైంసా ఏఎస్పీగా అవినాష్ కుమార్, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి, ఏటూరు నాగారం ఏఎస్పీగా శివమ్ ఉపాధ్యాయ నియమితులయ్యారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు మార్లు ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ప్రభుత్వ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా రాచకొండ సీపీగా ఉన్న సుధీర్ బాబును కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది.
ఆ తర్వాత రామగుండం సీపీగా ఎం. శ్రీనివాసులు, సైబరాబాద్ జాయింట్ సీపీగా జోయల్ డేవిస్, సీఐడీ డీఐజీగా నారాయణ నాయక్ నియమితులయ్యారు. రాచకొండ కొత్త సీపీగా తరుణ్ జోషిని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత మళ్లీ తాజాగా 8 మంది ఐపీఎస్ అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది.
Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
This website uses cookies.