Telangana Budget 2024 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ఇవాళ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా హైదరాబాద్ కే కేటాయింపులు చేసింది. హైదరాబాద్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది. జీహెచ్ఎంసీకి ఎక్కువ కేటాయింపులు చేసింది.
అన్ని డిపార్ట్ మెంట్ లకు కలిపి హైదరాబాద్ కోసం రూ.22,800 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించింది. ఇందులో జీహెచ్ఎంసీకి రూ.3065 కోట్లు కేటాయింపులు చేసింది. అలాగే జలమండలికి రూ.3385 కోట్లు, హెచ్ఎండీఏకు రూ.500 కోట్లు, ఎయిర్ పోర్ట్ మెట్రో రైలుకు రూ.500 కోట్లు, మూసీ సుందరీకరణ కోసం రూ.1500 కోట్లను కాంగ్రెస్ సర్కారు కేటాయించింది.
అయితే.. బడ్జెట్ లో ఎక్కువ ప్రాధాన్యత రాజధానికి ఇవ్వడం వెనుక కారణం గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచినా.. రాజధాని ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ హవానే నడిచింది. అంటే.. బీఆర్ఎస్ హైదరాబాద్ ను డెవలప్ చేసిందని అక్కడి ప్రజలు నమ్మారు. అందుకే హైదరాబాద్ లోని ప్రజలంతా కాంగ్రెస్ వైపు మళ్లేందుకు నగర ప్రజలను ఆకర్షించేందుకే ఎక్కువ మొత్తంలో కేటాయింపులు చేసినట్టుగా చెబుతున్నారు.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.